Husband Killed Wife: జౌన్పూర్లోని మడియాహున్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారకమైన కేసు తెరపైకి వచ్చింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని జైరాంపూర్ గ్రామంలో ఈ తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మొదట భార్యను కొట్టి చంపిన భర్త ఆ తర్వాత ముగ్గురు పిల్లలను చంపేశాడని చెబుతున్నారు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఇంటిలో మృతదేహాలు పడి ఉండటాన్ని చూసిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
చదవండి:Niharika Divorce: డైవర్స్ తర్వాత నిహారిక.. చైతన్య నుంచి ఎన్ని కోట్లు భరణం అడిగిందో తెలుసా?
జైరాంపూర్ గ్రామానికి చెందిన నాగేష్ విశ్వకర్మ తన భార్య రాధిక (35)ని బుధవారం ఉదయం ఏదో సమస్యపై కొట్టి చంపాడు. భార్యను హత్య చేసిన తర్వాత నిందితుడు తన ముగ్గురు అమాయక పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. పెద్ద కూతురు నికిత, కుమారుడు ఆదర్శ్, మూడేళ్ల కూతురు ఆయుషిని హత్య చేసిన తర్వాత నిందితుడు నగేష్ (37) గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం 10 గంటల వరకు ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో పొరుగున ఉంటున్న బంధువు సోను విశ్వకర్మ డయల్-112 పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల సమక్షంలో తలుపులు పగులగొట్టి చూడగా ఇంట్లో ఒకే బెడ్పై ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. పక్కనే మంచంపై భార్య రాధిక మృతదేహం కూడా కనిపించింది. భార్య తలపై గాయాలున్నాయి. గుడ్డ సహాయంతో చిన్నారుల గొంతు నులిమి చంపేశారు.
చదవండి:Salaar: స్టోరీ లైన్ లీక్..నెట్టింట ఫ్యాన్స్ హల్ చల్
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ అజయ్ పాల్ శర్మ కూడా పరిశీలించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం ఘటనపై విచారణ జరుపుతోంది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఒకే ఇంటికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారనే వార్త ఆ ప్రాంతంలో కలకలం రేపింది. దీంతో గ్రామమంతా శోకసంద్రం నెలకొంది. అయితే ఈ ఘటన వెనుక అసలు కారణం ఇంకా తెలియరాలేదు. నగేష్ విషకర్మ తన భార్య, ముగ్గురు పిల్లలను చంపిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అదనపు పోలీసు సూపరింటెండెంట్ రూరల్ శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. నిందితుడు ఎందుకు ఇలా చేశాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఫోరెన్సిక్ బృందాలు విచారణలో నిమగ్నమై ఉన్నాయి. మృతదేహాలన్నింటిని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

