SRCL: మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలోని నెహ్రు నగర్లో శుక్రవారం మహిళల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలపై హింస, లైంగిక దాడులు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.