ADB: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే వార్షిక పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించగలుగుతారని PRTU తెలంగాణ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆడే నూర్ సింగ్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంలోని కుంటాల(కే) బాలికల ఆశ్రమ పాఠశాల, స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థినులకు ప్రేరణ తరగతి నిర్వహించారు.