BHPL: జిల్లాలో ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP సంకీర్త్ తెలిపారు. SP మాట్లాడుతూ.. 21 పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 (144 సెక్షన్) నిషేధాజ్ఞలు అమలు చేసినట్లు SP వెల్లడించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎస్పీ కోరారు.