సత్యసాయి: కదిరి పట్టణంలో వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా తక్షణం చేపట్టాల్సిన పనులపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, RWS అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి ఎద్దడిని నివారించేందుకు అవసరమైన కీలక పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు.