KDP: సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలోని కడప చెన్నై జాతీయ రహదారి మలినేని పట్నం వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.