NGKL: పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన బొడ్రాయి, ఆంజనేయస్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని పూజలు చేశారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన మంత్రికి స్థానికులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.