జగిత్యాల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో గురువారం 2026-27 బడ్జెట్ సమావేశం మున్సిపల్ ఛైర్ పర్సన్ తమిళనాడు వాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని, వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.