JGL: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్ట్కార్డుల ఉద్యమం చేపట్టినట్లు కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్కుమార్ తెలిపారు. కోరుట్ల పట్టణంలో గురువారం జిల్లా న్యాయవాది మధుసూదర్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. భావితరాలకు శుభ్రమైన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో ప్లాస్టిక్ తగ్గించడం అవసరమన్నారు.