నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ను, తిరుపతి విమానాశ్రయంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోకేష్కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. గిరిధర్ రెడ్డిని లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. పలు అంశాలపై వారిద్దరూ చర్చించుకున్నారు.