బాపట్ల జిల్లా ఈతేరు గ్రామంలో గురువారం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. మద్యం మత్తులో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బాపట్ల ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.