MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు ఉండేలా సీసీ రోడ్డు నిర్మించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.