KNRL: తుగ్గలిలో ఈనెల 16 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను నాలుగు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఎంఈవో రమా వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు. జొన్నగిరి, పెండేకల్, తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, నోవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 612 మంది రెగ్యులర్ విద్యార్థులు, 3 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలురాయనున్నారని వెల్లడించారు.