ASR: డుంబ్రిగూడ అంగన్వాడీ సెంటర్ పక్కన ఉన్న మంచినీటి బోర్వెల్ ను వెంటనే మరమ్మత్తు చేయాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి గురువారం డిమాండ్ చేశారు. బోర్వెల్ పనిచేయకపోవడంతో అంగన్వాడీ చిన్నారులు, మహిళలు, గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.