SDPT: రంజాన్ మాసం సందర్భంగా సిద్దిపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందును శుక్రవారం నిర్వహించనుంది. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ పూజల హరికృష్ణ, పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఈ విషయాన్ని తెలిపారు. సిద్దిపేటలో జరిగిన సమావేశంలో శుక్రవారం సాయంత్రం మదీనా ఫంక్షన్ హాల్లో జరిగే ఈ విందుకు ముస్లిం ప్రజలు హాజరుకావాలన్నారు.