GDWL: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణలో భాగంగా ఇవాళ జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని, ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. ప్రభుత్వ రాయితీలు, పథకాలపై ప్రజా ప్రతినిధులకు ఆయన వివరించారు. అలాగే పీఎం ధనధాన్య యోజన ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.