AP: సీఎం చంద్రబాబుపై ప్రతి కేసును రీ ఓపెన్ చేయించి తీరుతానని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా అమ్మేస్తున్నారని, ఇది అన్యాయమని ప్రశ్నించిన తనపై కేసులు పెడుతున్నారని వాపోయారు. తన బినామీలకు ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిలో అతిపెద్ద భాగస్వామి పవన్ కళ్యాణ్ అంటూ ధ్వజమెత్తారు.