SRCL: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ కామర్స్ పరీక్షలలో 131 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. 16 పరీక్ష కేంద్రాలలో మొత్తం 4,295 విద్యార్థులకు గాను 4,164 విద్యార్థులు హాజరు అయినట్లు వెల్లడించారు. పరీక్షలను జిల్లా అధికారులు పర్యవేక్షించారని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని వివరించారు.