TG: రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారిని అస్సలు అనుమతించరు. కానీ విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.