WGL: నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో SC సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.