KMM: ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డుల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు పాత్ర పోషించాలని అన్నారు.