జగిత్యాల జిల్లాలో సాగునీటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సాగునీటి సమస్యలకు కృషి చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గిరిజన సంక్షేమ మంత్రిగా జిల్లాలో అన్ని గిరిజన గ్రామాలు, తండాలకు రవాణా సౌకర్యం కోసం నిధుల మంజూరుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని తెలిపారు.