ప్రకాశం: మార్కాపురం జిల్లాగా ప్రకటించి, కేబినెట్ ఆమోదించిన సందర్భంగా మంగళవారం ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాలాభిషేకం చేశారు. అధికారంలోకి రాగానే చెప్పినట్లుగానే మార్కాపురాన్ని జిల్లా ఏర్పాటు చేశారని, చంద్రబాబుకు రుణపడి ఉంటామని ఆయన తెలిపారు.