NRML: జిల్లా లక్ష్మణచందా మండలం పొట్టపల్లి (కె)లో “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక”ను కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్న ఆమె, 99 రోజుల కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో త్వరలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని, పాఠశాల మరమ్మత్తులు చేపడతామని ఆమె భరోసా ఇచ్చారు.