KMR: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి భౌతిక కాయానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నివాళులర్పించారు. తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆయన, మృతదేహాన్ని పరిశీలించి నివాళులు అర్పించారు. అనంతరం మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.