ADB: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ హైదరాబాదులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రెవెన్యూ సంబంధిత సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, పలు అంశాలపై మంత్రితో చర్చించినట్లు నరేష్ జాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.