ADB: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు రేపు ( రెండవ శనివారం) పని దినముగా ఉంటుందని జిల్లా ఇంఛార్జ్ డీఈవో రాజేశ్వర్ తెలిపారు. కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా గత అక్టోబర్ 7న రోజున సెలవు తీసుకున్నందువలన దానికి బదులుగా రేపు రెండవ శనివారం అన్ని పాఠశాలలు యధావిదంగా పనిచేయాలని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.