SDPT: ఈ నెల 8న శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో భద్రగిరి ప్రదక్షిణ ఉంటుంది. ఈ విషయాన్ని గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ అధ్యక్షులు, భకరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు శనివారం తెలిపారు. ఈ దైవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.