HYD: నగరంలో శాంతిభద్రతల పటిష్ఠత కోసం హైదరాబాద్ పోలీసులు ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో నిన్న రాత్రి 150 ప్రాంతాల్లో అకస్మాత్తుగా నాకాబందీ చేపట్టారు. సుమారు 5 వేల మంది పోలీసులు, సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఈ ముమ్మర తనిఖీలు జరిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ బృందాలు ఇందులో పాల్గొన్నాయి. అనుమానాస్పద కదలికలపై డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలకు సూచించారు.