ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని కొత్తూరు జాతీయ రహదారిపై హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు వాహనాల డ్రైవర్కు ఫేస్ వాష్ చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిద్ర వచ్చే పరిస్థితుల్లో వాహనాన్ని నడపవద్దు అని సూచించారు. నిద్ర మత్తులో ప్రమాదానికి గురి అయ్యే ఆస్కారం ఉందని తెలిపారు. ఆగి ఉన్న వాహనాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయాలని అన్నారు.