GDWL: గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ మూడో రోజుకు చేరుకుంది. సూపర్వైజర్ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో 14 ఏళ్ల బాలికలకు టీకాలు వేశారు. భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ టీకా రక్షణ కల్పిస్తుందని, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆమె తెలిపారు.