SRD: జిల్లా స్థాయి FLN తనిఖీ బృందం ఖేడ్ పట్టణంలోని నెహ్రు నగర్ ప్రాథమిక పాఠశాలను ఇవాళ సందర్శించింది. ఇందులో నోడల్ అధికారి యశ్వంత్, సభ్యులు నరేష్ కుమార్, శివ కుమార్ తరగతి గదుల్లో సందర్శించి FLN అమలు, పాఠశాలలో గల కనీస సౌకర్యాలు, విద్యార్థుల మార్కులు, విద్యార్థుల ప్రగతులను పరిశీలించారు. అనంతరం స్థానిక హెచ్ఎం గంగమణితో సమావేశమయ్యారు.