IPL-2026 మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించడంపై సందిగ్ధత నెలకొంది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇక్కడ మ్యాచ్లు ఆడటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. అయితే, తాజాగా మరోసారి కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియం భద్రతా క్లియరెన్స్ నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే మ్యాచ్ల నిర్వహణపై స్పష్టత రానుంది.