ప్రకాశం: రాచర్లలో నీటి సమస్యతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నెలలుగా పాత పోస్ట్ ఆఫీస్ బజారు, బీసీ కాలనీలో నీటి బోరులు చెడిపోయి ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి కిలోమీటర్ల మేర వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అధికారులకు పలుమార్లు సమస్యను తెలిపినా పట్టించుకోలేదని వాపోయారు.