ప్రకాశం: కంభంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణారెడ్డి పరిసరాల పరిశుభ్రతపై సిబ్బందికి అవగాహన కల్పించారు. శుభ్రమైన వాతావరణం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.