NDL: కేంద్ర న్యాయశాఖ లేఖకు అనుగుణంగా హైకోర్టు న్యాయమూర్తులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ పరిమితిని పెంచినట్లు మంగళవారం న్యాయశాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 2024 జనవరి 1 నుంచి గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచినట్లు మంత్రి ఫరూక్ వెల్లడించారు.