KDP: YVU విశ్వవిద్యాలయం 21వ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ.. యువత మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. కేవలం గ్రూప్స్, సివిల్స్ వంటి వాటిపైనే దృష్టి సారించి సమయాన్ని వృధా చేసుకోకుండా, సంపద సృష్టిలో చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్ఛారు.