అనంతపురంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తల్లి సాకే గంగమ్మ శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ వారి ఇంటికి వెళ్లి భౌతికకాయనికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం శైలజానాథ్ను, కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.