జమ్మూలోని కశ్మీర్ టైమ్స్ ఆఫీసులో స్టేట్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పిస్టల్ రౌండ్స్, మూడు గ్రనేడ్ లెవర్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధం ఉన్న డాక్టర్ల కోసం సోదాలు నిర్వహిస్తుండగా ఈ ఆయుధాలు పట్టుబడ్డాయి.