RR: శేరిలింగం పల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు వద్ద ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీలో క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షల కిట్ (జామెట్రీ బాక్స్, ప్యాడ్, కలములు) విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ నర్నె శ్రీనివాస్ రావు అందచేశారు.