VZM: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా అధ్యక్షుడు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ గ్రంథాలయంలో జిల్లాలోని 15 పాఠశాలలకు చెందిన 300 మంది ఉత్తమ విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. పిల్లలు వారానికి ఒక్కసారైనా గ్రంథాలయానికి వెళ్లి అభ్యసించాలన్నారు.