T20 WCలో భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో HYD నుంచి T20 WC విజయంలో భాగమైన తిలక్ వర్మ, సిరాజ్లను TG ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలుస్తోంది. సిరాజ్కు గతంలోనే భారీ రివార్డ్ ప్రకటించిన నేపథ్యంలో తిలక్ వర్మకు ఈ సారి భారీ నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.