VSP: భారత్ ఫోర్జ్ వైస్ఛైర్మన్ అమిత్ కల్యాణి గురువారం విశాఖలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులపై వారిరువురూ చర్చించారు. భారత్ ఫోర్జ్ సంస్థ ఏపీలో షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్ ఉత్పత్తులపై ఆసక్తి వ్యక్తం చేసింది. దీంతో ఏపీలో వారు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎం తెలిపారు.