RR: గచ్చిబౌలిలో జరిగిన “కమ్మ ఐకాన్ లెజెండరీ అవార్డ్స్ – 2026” వేడుకలో ప్రముఖ సామాజిక కార్యకర్త, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారాన్ని అందుకున్నారు. సమాజ సాధికారత, విద్య, వైద్యం, పేదల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు.