WNP: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులను ఏర్పాటు చేశారు.