KMM: తిరుమలాయపాలెంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత భర్త పురుగుల మందు తాగి ప్రాణాంతక నిర్ణయం తీసుకున్నాడు. తోటమళ్ల నాగభూషణం రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు మూడు సార్లు ప్రయత్నించగా భార్య జయమ్మ అడ్డుకుంది. దీంతో అడ్డుగా ఉన్న భార్యను హతమార్చినట్లు సమాచారం.