W.G: తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు సైనిక్ స్కూల్ ప్రవేశానికి అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్ రాజారావు తెలిపారు. 9వ తరగతి నుంచి 22 మంది, 6వ తరగతి 8మంది ఎంపికైనట్లు వివరించారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను వారు కలిశారు.