VZM: మొంథా తుఫాన్ నేపథ్యంలో వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా తగు ముందస్తు చర్యలను నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆధ్వర్యంలో సిబ్బంది చేపడుతున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రధాన కాలువల గుండా నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించే ప్రక్రియను కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షించారు. జేసీబీల సహాయంతో అవసరమైన చర్యలను చేపట్టారు.