W.G: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం దృష్ట్యా ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు మంగళవారం మండలంలో పర్యటించారు. సహాయ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రజల వివరాలు, వారికీ కల్పిస్తున్న భద్రత, ఇతర సౌకర్యలకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారుల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.