NLR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కందుకూరు నియోజకవర్గానికి అత్యధికంగా ఆర్థిక సహాయాలు మంజూరయ్యాయని MLA ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. శనివారం కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో 53 మందికి రూ.31.73 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ప్రజల ఆరోగ్య భద్రతకు CM చంద్రబాబు అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.